- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాత్రి నుంచి అంధకారంలో ముంబై
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: బీఈఎస్టీ ప్లాంట్లో సాంకేతిక లోపం కారణంగా ఆదివారం రాత్రి ముంబై నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ మేరకు బృహన్ ముంబై కార్పొరేషన్ ఓ ప్రకటన చేసింది. మహారాష్ట్ర గ్రిడ్ వైఫల్యం కారణంగా ముంబై సబర్బన్ రైలు సర్వీసులు దెబ్బతిన్నాయని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ పేర్కొన్నారు. దీంతో పలు పరిశ్రమలు కూడా నిలిచిపోయాయి. అయితే సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుంది అనేది ఇంకా ప్రకటించలేదు. దాదాపు గా ముంబై మొత్తం […]</p>

X
దిశ, వెబ్డెస్క్: బీఈఎస్టీ ప్లాంట్లో సాంకేతిక లోపం కారణంగా ఆదివారం రాత్రి ముంబై నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ మేరకు బృహన్ ముంబై కార్పొరేషన్ ఓ ప్రకటన చేసింది. మహారాష్ట్ర గ్రిడ్ వైఫల్యం కారణంగా ముంబై సబర్బన్ రైలు సర్వీసులు దెబ్బతిన్నాయని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ పేర్కొన్నారు. దీంతో పలు పరిశ్రమలు కూడా నిలిచిపోయాయి. అయితే సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుంది అనేది ఇంకా ప్రకటించలేదు. దాదాపు గా ముంబై మొత్తం అంధకారంలోనే ఉంది. రైళ్ళ రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడటంతో ఆటోల్లో, బస్సుల్లో ముంబై వాసులు ప్రయాణం చేస్తున్నారు.
Next Story






