నేడు ఈ 5 మండలాలకు విద్యుత్ సరఫరా బంద్

by  |
p-no
X

దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం 132/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని కాటారం, మహాముత్తారం, మల్హర్, మహాదేవపూర్, పలిమెల మండలాల్లో ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కాటారం ఏడీఈ సంపత్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. కాటారం 132/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ లో మరమ్మతు పనుల దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని.. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

Next Story

Most Viewed