పౌడర్ బాబా.. మహిళలను వాటితో కొడుతూ వికృత చేష్టలు

by  |
పౌడర్ బాబా.. మహిళలను వాటితో కొడుతూ వికృత చేష్టలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచం నూతన టెక్నాలజీ తో ముందుకు దూసుకెళ్తోంది. మనుషులు ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలను చేస్తున్నారు. కానీ, కొంతమంది మాత్రం కొన్ని మూఢనమ్మకాలతోనే జీవిస్తున్నారు. ప్రపంచం ముందుకు పోతున్నా వారు మాత్రం అక్కడే ఆగిపోతున్నారు. ఈ మూఢనమ్మకాల పేరుతో దొంగ బాబాలు చేసే అకృత్యాలు దారుణంగా ఉంటున్నా.. వారినే ప్రజలు బలంగా విశ్వసిస్తుండడం బాధాకరం. తాజాగా దెయ్యాన్ని వదలకొడతానని ఓ దొంగ బాబా మహిళలను చిత్రహింసలకు గురిచేసిన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే..

తమిళనాడులో నామక్కల్ జిల్లా కాదపల్లిలో చోటుచేసుకుంది. కాదపల్లికి చెందిన అనిల్‌కుమార్ అనే వ్యక్తి కురుప్పన్న స్వామి ఆలయాన్ని తన వికృత చేష్టలకు అడ్డగా మార్చుకున్నాడు. అనిల్ కుమార్ పేరును పౌడర్ బాబా గా మార్చుకొని దెయ్యాలను వదిలిస్తానాన్ని గ్రామస్తులను నమ్మించాడు. దీంతో వారందరు ఆలయం వద్ద క్యూ కట్టారు. దెయ్యం వదిలిస్తున్నా అనే పేరుతో మహిళలను చిత్రహింసలకు గురిచేయడం మొదలుపెట్టాడు. కొరడాలతో కొట్టడం, కాళ్లతో వారిని తన్నుతూ, కర్రలతో వారిని చితకబాదడం చేస్తుండేవాడు. మహిళలను హింసిస్తున్న దృశ్యాలను కొందరు సెల్ ఫోన్ లో చిత్రీకరించి వాట్సాప్ లో పెట్టడంతో వైరల్ గా మారాయి. వీటిని చూసిన పోలీసులు దొంగబాబా ను అరెస్ట్ చేసి ఆలయాన్ని సీజ్ చేశారు.



Next Story