నా కూతురిది ముమ్మాటికీ హత్యే..

by  |
నా కూతురిది ముమ్మాటికీ హత్యే..
X

దిశ, వెబ్‌డెస్క్: తొమ్మిది నెలల చిన్నారిని అపార్టుమెంట్‌ పై నుంచి కింద పడేసి, తల్లీ కూడా దూకి చనిపోయిన ఘటన గుంటూరు జిల్లాలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతురాలు మనోజ్ఞ భర్త, అత్త, మామలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఇప్పటికే సెక్షన్ 306, 498ఏ కింద కేసు నమోదు చేశారు. అయితే, తల్లీబిడ్డను భర్తే అపార్ట్‌మెంట్ పైనుంచి తోసేశారని మనోజ్ఞ తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా.. ఆ ఆరోపణలన్నీ అవాస్తవాలేనని తాను ఇష్టపడే మనోజ్ఞను పెళ్లి చేసుకున్నానని కల్యాణ్ చంద్ర వివరించారు.

ఇదిలాఉండగా, తల్లీకూతుర్ల మృతదేహాలకు గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. ఈ క్రమంలోనే మృతదేహాలను భర్త ఇంటికి తీసుకెళ్లేందుకు బంధువులు యత్నించారు. వారిని అడ్డుకోబోయిన మృతురాలి తల్లి తరఫు బంధువులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారి తీరుపై అమ్మాయి తరఫు బంధువులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మనోజ్ఞను అత్తింటివారే చంపారని వారు ఆరోపిస్తున్నారు. హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని.. పోలీసులు నిందితులతో కుమ్మక్కయ్యారని మనోజ్ఞ తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా, మృతదేహాలను చూసేందుకు భర్త, అత్తమామ రాలేదని తెలుస్తోంది.



Next Story

Most Viewed