పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు పొడగింపు

by  |
Post Metric Scholarship
X

దిశ. తెలంగాణ బ్యూరో: పోస్ట్ మెంట్రిక్ స్కాలర్ షిప్ దరఖాస్తు గడువును పొడగించారు. ఈ నెల 21 వరకు నూతనంగా దరఖాస్తులు, రిన్యూవల్ చేసేందుకు అవకాశం కల్పించారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీలు, వికలాంగులు దరఖాస్తు చేసుకోవల్సిందిగా షెడ్యూల్ కాస్ట్ డెవలప్‌మెంట్ అడిషనల్ సెక్రటరీ సీహెచ్.రాజసులోచన తెలిపారు. ఈ ఏడాది చాలా మంది అర్హులైన విద్యార్థులు స్కాలర్ షిప్‌లకు దరఖాస్తు చేసుకోనందున గడువును పొడగించామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు స్కాలర్ షిప్ పొందాల్సిందిగా సూచించారు.


Next Story