షాక్ లో టాలీవుడ్ ఇండస్ట్రీ.. కరోనాతో మరో ప్రముఖ నిర్మాత మృతి

by  |
షాక్ లో టాలీవుడ్ ఇండస్ట్రీ.. కరోనాతో మరో ప్రముఖ నిర్మాత మృతి
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. చిత్ర పరిశ్రమను కరోనా పట్టి పీడిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలామంది ప్రముఖులు కరోనా మహమ్మారి వలన మృతి చెందారు. తాజాగా మరో నిర్మాత కరోనా కాటుకు బలైయ్యారు. ప్రముఖ నిర్మాత చిట్టి నాగేశ్వరరావు అలియాస్ సిఎన్‌ రావు కరోనాతో మృతి చెందారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. తెలుగు లో ‘మా సిరిమల్లె’, ‘అమ్మా నాన్న లేకుంటే’, ‘బ్రహ్మానందం డ్రామా కంపెనీ’ చిత్రాలను నిర్మించారు. తమిళ్‌లో ‘ఊరగా’ అనే సినిమా ద్వారా పరిచయమై మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో జన్మించిన సీఎన్‌ రావు పంపిణీదారునిగా, నిర్మాతగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. సిఎన్‌ రావు మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. సిఎన్‌ రావు మరణం టాలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటు అని విచారం వ్యక్తం చేస్తున్నారు.

Next Story