భగవంతున్నీ లైన్లో నిలబెట్టారు: ప్రకాశ్‌రాజ్

by  |
భగవంతున్నీ లైన్లో నిలబెట్టారు: ప్రకాశ్‌రాజ్
X

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎస్ బ్యాంకులో భగవాన్ జగన్నాథ్(పూరీ జగన్నాథ ఆలయం)పేరుతో జమ అయిన రూ.545 కోట్ల మొత్తంపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ ఈ ఉదంతంపై ఇవాళ స్పందించారు. తన ట్విట్టర్ ఖాతాలో ‘హే భగవాన్, మిమ్మల్ని కూడా లైనులో నిలబెట్టారు. పూరీ జగన్నాథుని రూ. 545 కోట్ల మొత్తం ఎస్ బ్యాంకులో చిక్కుకుపోయిందుకు భక్తులు చింతిస్తున్నారు’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.


tags: actor prakash raj, yes bank crisis, puri jagannath temple,prakash raj purijagannat temple issue

Next Story