నన్ను కాదు 'డియర్'.. డైరెక్టర్‌ను అడగండి

by  |
నన్ను కాదు డియర్..  డైరెక్టర్‌ను అడగండి
X

దిశ, వెబ్‌డెస్క్: బుట్టబొమ్మ పూజా హెగ్డే బిజీ అయిపోయింది. బాలీవుడ్, టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిన పూజా…. వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ప్రభాస్ పిరియాడికల్ లవ్ స్టోరి ‘ఓ డియర్‌’ లో నటిస్తున్న అమ్మడు…. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటూ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు దగ్గరవుతోంది. ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించిన పూజా… ‘ఓ డియర్’ ఫస్ట్ లుక్ గురించి అడిగితే మాత్రం .. తెలియదు.. నాకు తెలియదు… అని సమాధానం ఇచ్చింది. దర్శకుడు రాధాకృష్ణ డైరెక్షన్‌లో వస్తున్న మూవీ జార్జియా షెడ్యూల్ ఈ మధ్యే పూర్తి కాగా .. త్వరలోనే ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని ప్రకటించాడు. దీంతో ఉగాది కానుకగా ఫస్ట్ లుక్ వస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ సంబరపడిపోయారు. కానీ అది జరగలేదు. ఈ విషయాన్నే పూజాను అడిగితే… నాకు ఆ విషయం గురించి తెలియదు డైరెక్టర్ గారిని అడగాలి అని చెప్పి తప్పించుకుంది.

యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘ఓ డియర్’ మూవీలో ప్రభాస్ సరసన పూజా హెగ్డేతో పాటు రిద్ది కుమార్ కూడా నటిస్తున్నట్లు సమాచారం. కరోనా ఎఫెక్ట్‌తో సినిమా షూటింగ్ వాయిదా పడగా మూవీ యూనిట్ సెల్ఫ్ క్వారెంటైన్‌లో ఉన్నారు.

Tags: ODear, Prabhas, Pooja Hegde, Radhakrishna



Next Story