పూజా హెగ్డే వరంగల్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?

by  |
పూజా హెగ్డే వరంగల్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : బ్యూటిఫుల్ పూజా హెగ్డే ‘బుట్టబొమ్మ’ సాంగ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. యూట్యూబ్‌లో 500 మిలియన్ వ్యూస్ సాధించి, రికార్డు సృష్టించిన బుట్టబొమ్మ.. రికార్డ్‌లు సెట్ చేసే దిశలో దూసుకుపోతోంది. ఈ హ్యాపీనెస్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన పూజ.. మరో ఎమోషనల్ స్టోరీని కూడా అభిమానులతో పంచుకుంది. వరంగల్ ఫ్యాన్స్ తన పేరుమీద లాక్‌డౌన్‌లో చేసిన సామాజిక కార్యక్రమాలను చూస్తుంటే గర్వంగా ఉందని తెలిపింది. కరోనా టైమ్‌లో ఆహారం, పండ్లు, బెడ్ షీట్స్, శానిటైజర్స్ పంపిణీ చేసిన ఫ్యాన్స్‌కు థాంక్స్ చెప్పింది. తన లైఫ్‌లో ది బెస్ట్ అంటూ ఇందుకు సంబంధించిన ఫ్లెక్సీని కూడా షేర్ చేసింది పూజ. ‘అతిథి’ మానసిక దివ్యాంగుల ట్రస్ట్‌లో ఈ పంపిణీ కార్యక్రమం జరగ్గా.. పూజ తన స్టోరీస్‌లో తమ గురించి షేర్ చేయడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.


Next Story