ఆ విధంగా మీరు పబ్బం గడుపుకున్నారు !

by  |
ఆ విధంగా మీరు పబ్బం గడుపుకున్నారు !
X

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ సమయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడటం దొంగే దొంగ అన్నట్లు ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. దీపాలు, చప్పట్లకు పిలుపు నిస్తూ బీజేపీ రాజకీయ పబ్బంగడుపుకుందని ఆయన విమర్శించారు. నిర్మలా సీతారామన్‌కు రాహుల్‌గాంధీని విమర్శించే అర్హత లేదని మండిపడ్డారు. ఏసీ రూముల్లో కూర్చొని మాట్లాడటం కాదని, రోడ్ల మీదికి వస్తే కార్మికుల బాధలు తెలుస్తాయన్నారు. రూ.20లక్షల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని, కరోనా మాటున ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేసేందుకు చేస్తున్నారని ఆరోపించారు.

Next Story