ప్రాజెక్టులకు వారి పేర్లు పెట్టి మోసం చేస్తున్నారు: పొన్నాల

by  |
ప్రాజెక్టులకు వారి పేర్లు పెట్టి మోసం చేస్తున్నారు: పొన్నాల
X

దిశ,వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వం లీకుల ప్రభుత్వమని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ప్రెస్ నోటులతోనే ఈ ప్రభుత్వం సరిపెడుతోందని ఆయన తెలిపారు. ప్రాజెక్టులకు దేవుళ్ల పేర్లు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు ప్రభుత్వానికి ఇప్పుడు గుర్తుకు వచ్చాయని ఆరోపించారు. కృష్ణా జలాలను ఏపీ తరలించుకు పోతుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.



Next Story