ఉప ఎన్నిక బరిలో పొన్ రాధాకృష్ణన్..

by  |
ఉప ఎన్నిక బరిలో పొన్ రాధాకృష్ణన్..
X

చెన్నై: లోక్‌సభ నియోజకవర్గం కన్యాకుమారికి ఏప్రిల్ 6న జరగనున్న ఉపఎన్నికలో బీజేపీ నుంచి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్ పోటీ చేయనున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐఏడీఎంకేతో సీట్ల పొత్తుపై శుక్రవారం రాత్రి ఏకాభిప్రాయం కుదిరింది.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 20 సీట్లను ఏఐఏడీఎంకే.. బీజేపీకి కేటాయించింది. వీటితోపాటు కన్యాకుమారికి జరగనున్న లోక్‌సభ స్థానాన్ని కూడా బీజేపీకి అప్పగించింది. ఈ స్థానంలో బీజేపీకి పూర్తి మద్దతు ఇవ్వనున్నట్టు అంగీకరించింది. కాంగ్రెస్ ఎంపీ హెచ్ వసంత కుమార్ కరోనా కారణంగా గతేడాది ఆగస్టులో మరణించడంతో ఈ స్థానం ఖాలీ అయిన సంగతి తెలిసిందే. 2014లో ఈ స్థానం నుంచి విజయం సాధించిన పొన్ రాధాకృష్ణన్.. 2019 ఎన్నికల్లో వసంత కుమార్‌పై ఓడిపోయారు.



Next Story

Most Viewed