సీతల్ కుంచ్‌లో పోలింగ్ వాయిదా

by  |
సీతల్ కుంచ్‌లో పోలింగ్ వాయిదా
X

కోల్‌కత: బెంగాల్‌లోని కూచ్‌బీహార్ జిల్లాలోని సీతల్ కుచ్‌లో పోలింగ్ స్టేషన్ 125 వద్ద జరుగుతున్న పోలింగ్‌ను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. సీతల్ కుచ్ పోలింగ్ స్టేషన్ వద్ద శనివారం బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్‌ల మధ్య ఘర్షణల నేపథ్యంలో సీఐఎస్ఎఫ్ బలగాలు కాల్పులు జరపాయి. ఈ కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మరణించారు. కాగా ఈ ఘర్షణలను ఈసీ తీవ్రంగా పరిగణించింది. ఘటనపై సమగ్ర వివరాలను ఈ రోజు సాయంత్రం 5 గంటల్లోగా అందజేయాలని సీఈవో, ఎన్నికల పరిశీలకులను ఈసీ ఆదేశించింది. ఘర్షణల నేపథ్యంలో పోలింగ్‌ను వాయిదా వేస్తు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.


Next Story