యడియూరప్పకు తృటిలో తప్పిన ప్రమాదం

by Dishafeatures2 |
యడియూరప్పకు తృటిలో తప్పిన ప్రమాదం
X

దిశ, డైనమిక్ బ్యూరో : బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు త్రుటిలో ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. యడియూరప్ప, పలువురు బీజేపీ నేతలతో కలిసి కలబురిగిలోని జేవర్జిలో ఓ కార్యక్రమానికి వెళ్లారు. జెవర్జి ప్రాంతంలో హెలికాప్టర్‌ను దించేందుకు స్థానిక అధికారులు హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అయితే ఆ హెలిప్యాడ్‌పై చెత్తాచెదారం, ప్లాస్టిక్‌ షీట్లు పేరుకుపోయాయి. హెలికాప్టర్‌ ల్యాండ్ అయ్యేందుకు కిందకు రాగానే అవన్నీ ఒక్కసారిగా పైకి ఎగిరి ల్యాండింగ్‌కు ఇబ్బందిగా మారాయి.

దీంతో పైలట్‌ చివరి నిమిషంలో ల్యాండింగ్‌ చేయకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ తర్వాత స్థానిక యంత్రాంగం హెలిప్యాడ్‌‌ను క్లీన్ చేసి ల్యాండింగ్‌కు వీలు కల్పించారు. అప్పటిదాకా హెలికాప్టర్‌ అక్కడే గాల్లో చక్కర్లు కొట్టింది. కొంతసేపటి తర్వాత అదే హెలిప్యాడ్‌పై సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story

Most Viewed