ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా: మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

by Disha Web Desk 11 |
ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా: మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
X

దిశ, కుత్భుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ హామీ ఇచ్చారు. ఆదివారం 'కుత్బుల్లాపూర్ గోస - శ్రీశైలం అన్న భరోసా' కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ సూరారం 129 డివిజన్ లోని మార్కండేయ నగర్, నెహ్రు నగర్ లలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ బస్తీలలో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. మార్కండేయ నగర్, నెహ్రు నగర్ లలో డ్రైనేజ్, సీసీ రోడ్డు, తాగునీరు, డబుల్ బెడ్ రూం, పెన్షన్లు తదితర సమస్యలను శ్రీశైలం గౌడ్ దృష్టికి తీసుకరాగా వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

మార్కండేయ నగర్, నెహ్రు నగర్ లలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ముచ్చటగా మూడో సారి ప్రజలను మోసం చేయడానికి ఎమ్మెల్యే ప్రగతి యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కేకేఎం ట్రస్ట్ చైర్మన్, బీజేపీ నాయకులు కూన శ్రీనివాస్ గౌడ్, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి, డివిజన్ అధ్యక్షులు దుర్యోధన్ రావ్, డివిజన్ ఇంఛార్జ్ రాజిరెడ్డి, సీనియర్ నాయకులు చండి శ్రీనివాస్, భావిగడ్డ రవి, పత్తి రఘుపతి, కూన రఘు గౌడ్, సురేష్ గౌడ్, రాజేష్ మిశ్రా, సుశాంత్ గౌడ్, వారాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story