హుజూరాబాద్‌‌లో నిలిచేదెవరు?

by Dishafeatures2 |
హుజూరాబాద్‌‌లో నిలిచేదెవరు?
X

దిశ, కరీంనగర్​ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ బరిలో​ బీఆర్​ఎస్​ అభ్యర్ధి ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2021 ఉప ఎన్నికల్లో ఈటలపై పోటీ చేసి ఓటమి చెందిన గెల్లు శ్రీనివాస్​కు వచ్చే ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీ తరుపున బరిలో నిలిచే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. గెల్లు శ్రీనివాస్​ను తెలంగాణ టూరిజం డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ చైర్మన్​గా నియమించడం అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. దీంతో హుజూరాబాద్​ నియోజకవర్గం రాష్ర్ట వ్యాప్తంగా మరోమారు చర్చకు దారితీసింది. ఇటీవల హుజూరాబాద్​లో జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్​ ఎన్నికల సమయం వరకు ప్రజల మధ్యనే ఉండాలని ఎమ్మెల్సీ కౌశిక్​ రెడ్డికి సూచించడం, ఇప్పుడు గెల్లుకు చైర్మన్​ పదవి ఇవ్వడం అందుకు బలాన్ని చేకూరుస్తోంది. అయితే 2023 ఎన్నికల్లో ఈటల ప్రత్యర్థి కౌశిక్​ రెడ్డినా..? లేక ఈటలకు దీటుగా ఎన్నికల సమయానికి కొత్త వారిని తెరమీదకు తీసుకొస్తారా..? అనేది హాట్​ టాఫిక్​గా మారింది.

అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ బరిలో​ బీఆర్​ఎస్​ అభ్యర్ధి ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2021 ఉప ఎన్నికల్లో ఈటలపై పోటీ చేసి ఓటమి చెందిన గెల్లు శ్రీనివాస్​కు వచ్చే ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీ తరుపున బరిలో నిలిచే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. ఎందుకంటే గెల్లు శ్రీనివాస్​ను తెలంగాణ టూరిజం డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ చైర్మన్​గా నియమించడం అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. దీంతో హుజూరాబాద్​ నియోజకవర్గం రాష్ర్ట వ్యాప్తంగా మరోమారు చర్చకు దారితీసింది. ఇటీవల హుజూరాబాద్​లో జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్​ ఎన్నికల సమయం వరకు ప్రజల మధ్యనే ఉండాలని ఎమ్మెల్సీ కౌశిక్​ రెడ్డికి సూచించడం, ఇప్పుడు గెల్లుకు చైర్మన్​ పదవి ఇవ్వడం అందుకు బలాన్ని చేకూరుస్తోంది. అయితే 2023 ఎన్నికల్లో ఈటల ప్రత్యర్థి కౌశిక్​ రెడ్డినా..? లేక ఈటలకు దీటుగా ఎన్నికల సమయానికి కొత్త వ్యక్తిని తెరమీదకు తీసుకువస్తారా..? అనేది హాట్​ టాఫిక్​గా మారింది.

ఉప ఎన్నికలో ఓటమితో అబాసుపాలు..

ఈఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ బీఆర్ఎస్​ అభ్యర్తి ఎవరనేది ఇప్పుడు రాష్ర్ట వ్యాప్తంగా చర్చనీయంగా మారింది. నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పట్టున్న ఈటలకు దీటైన అభ్యర్థిని బరిలో నిలిపి 2021 ఉప ఎన్నికల్లో జరిగిన ఓటమికి ప్రతికారం తీర్చుకోవాలని బీఆర్​ఎస్​ పార్టీ భారీ స్కెచ్​ వేసినట్లు కనిపిస్తోంది. 2021లో ఉత్కంఠగా జరిగిన హుజూరాబాద్​ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల రాజేందర్​ విజయం సాధించిన విషయం ​తెలిసిందే. కాగా, ఉప ఎన్నిక కోసం రాష్ర్టంలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను మొత్తం బలగాన్ని మోహరించినప్పటికీ, రూ.కోట్ల డబ్బు కుమ్మరించినా అధికార పార్టీకి ఓటమి తప్పలేదు. హుజూరాబాద్​ నియోజకవర్గంలో గ్రామగ్రామనా పట్టున్న ఈటల రాజేందర్​పై తెలంగాణ ఉద్యమకాలం నుంచి బీఆర్​ఎస్​లో పని చేస్తున్న గెల్లు శ్రీనివాస్​ను బరిలోకి దింపింది. అంతేకాక ఈటల రాజేందర్​, గెల్లు శ్రీనివాస్​ ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఈటలను ఓడించవచ్చు అనే ప్రణాళికతో బీఆర్​ఎస్​ చేసిన ప్లాన్​ తలకిందులైంది. ఆ పార్టీ ప్రతిష్టత్మకంగా తీసుకున్న ఎన్నికలో ఓటమి మూటకట్టుకొని ఆబాసుపాలైయింది.

హుజూరాబాద్​‌పై స్పెషల్​ పోకస్​..

2021 ఉప ఎన్నికలో ఓటమి తరువాత బీఆర్​ఎస్​ పార్టీ స్పెషల్​ పోకస్​ పెట్టినట్లు కనిపిస్తుంది. 2021 ఉప ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీ అభ్యర్ధిగా బరిలో నిలిచి ఓటమి పాలైన గెల్లు శ్రీనివాస్​కు మరో మారు అవకాశం కల్పిస్తారని అందరు భావించారు. వచ్చే ఎన్నికల్లో ఈటలపై బలమైన అభ్యర్థిని బరిలో నిలిపి 2021 ఎన్నికల ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇటీవల హుజూరాబాద్​ పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్​ ఎమ్మెల్సీ కౌశిక్​ రెడ్డిని ఉద్దేశించి వచ్చే ఎన్నికల వరకు హుజూరాబాద్​ విడిచి వెళ్లొద్దని, ప్రజల మధ్యనే ఉండాలని సూచించారు. బహిరంగ సభలో కేటీఆర్​ ప్రకటనతో వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్​ నుంచి బీఆర్​ఎస్​ అభ్యర్థిగా ఎమ్మెల్సీ కౌశిక్​ రెడ్డికి టికెట్​ ఖాయం అయినట్లు భావించారు. గడిచిన కొన్ని రోజులుగా కౌశిక్​ రెడ్డి సైతం హుజూరాబాద్​లో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వం తరుపున వచ్చే పథకాలను నేరుగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా అందజేస్తున్నాడు.

గెల్లుకు అవకాశం లేనట్లే..

టీఆర్​ఎస్​ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో పని చేస్తున్న గెల్లు శ్రీనివాస్​ అంశం ఇప్పుడు మరోమారు హాట్ టాపిక్‌గా మారింది. గెల్లును తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్​ కార్పొరేషన్​ చైర్మన్​గా సీఎం కేసీఆర్ నియమించారు. ఈ ఏడాది నవంబర్​ లేదా డిసెంబర్​ నెలలో రాష్ర్ట శాసనసభకు ఎన్నికలు జరుగుతాయని అందరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గెల్లు శ్రీనివాస్​కు కార్పొరేషన్​ చైర్మన్​‌గా పదవి ఇవ్వడంతో వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్​ బరిలో గెల్లుకు అవకాశం లేదనే చర్చ జరుగుతోంది. హుజూరాబాద్​ బరిలో బీఆర్​ఎస్​ పార్టీ కౌశిక్​ రెడ్డిని నిలుపుతుందా..? లేదా కొత్త వ్యక్తిని తెరపైకి తీసుకువస్తుందా..? అనేది వేచి చూడాల్సిందే..


Next Story

Most Viewed