తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

by Dishafeatures2 |
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, అందులో ఎలాంటి సందేహం లేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. సోమవారం హైదరాబాద్ కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తాము రాష్ట్రానికి ఏదేదో చేశామని బీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతోందని, కానీ ఆ విషయాన్ని చెప్పాల్సింది ప్రజలు అని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి సెల్ఫ్ ప్రమోషన్ మీద ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదని మంత్రి మండిపడ్డారు. ఈ తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడ్డదని, ప్రజలకు జరిగిన మేలు ఏం లేదని అన్నారు. ఈ సారి మళ్లీ తామే గెలుస్తామని బీఆర్ఎస్ నేతలు కలలు కంటున్నారని కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది మాత్రం బీజేపీయేనని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

Next Story

Most Viewed