అసద్ నోరు తిరిస్తే విషమే చిమ్ముతారు: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

by Dishafeatures2 |
అసద్ నోరు తిరిస్తే విషమే చిమ్ముతారు: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ విరుచుకుపడ్డారు. అసదుద్దీన్ నోరు తెరిస్తే విషమే చిమ్ముతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం గురించి అసద్ ఏనాడు మాట్లాడరని, జిన్నా పోయినా ఆయన వారసుల రూపంలో చాలామంది దేశంలో ఉన్నారు అని కేంద్ర మంత్రి మండిపడ్డారు. అంతకు ముందు మాట్లాడిన అసదుద్దీన్ యూపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

యూపీలోని బుల్ డోజర్ ప్రభుత్వం ఓ తల్లి కూతుళ్ల ప్రాణాలు తీసిందని ఆరోపించారు. యూపీలో రాజ్యాంగంతో కాకుండా బుల్ డోజర్ లతో ప్రభుత్వాన్ని నడపాలని చూస్తున్నారని విమర్శించారు. ఇలా చేస్తే రాజకీయంగా వాళ్లు ఏం సాధించలేరని అన్నారు. ఈ ఏడాది చివరిలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చతికిల పడుతుందని అసద్ చెప్పారు.

Next Story