టీడీపీ సత్తా చాటాం.. టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్

by Dishafeatures2 |
టీడీపీ సత్తా చాటాం.. టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీడీపీ ప్రతినిధులంతా భారీగా స్వచ్ఛందంగా తరలివచ్చి సత్తాచాటారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. గురువారం మీడియా ప్రకటన విడుదల చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఆవిర్భావ సభకు రెండు తెలుగురాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులంతా తరలివచ్చారని, అంచనాలకు మించి వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీకి తెలంగాణలో పూర్వవైభవం తేవడంతో పాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తాచాటుతామన్నారు.

బడుగు, బలహీన వర్గాలకు పసుపే శ్రీరామరక్ష అన్నారు. ఇంటింటికీ టీడీపీతో ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందని, ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు. మొన్న ఖమ్మం.. నేడు నాంపల్లిలో ఆవిర్భావ సభను విజయవంతం చేసి తెలంగాణలో పార్టీయే లేదన్నవారికి సమాధానం ఇచ్చామన్నారు. అసెంబ్లీ స్థానాలను గెలిచి టీడీపీ ఏంటో నిరూపిస్తామన్నారు.


Next Story