నేతలంతా తరలిరావాలి : కాసాని

by Dishafeatures2 |
నేతలంతా తరలిరావాలి : కాసాని
X

దిశ, తెలంగాణ బ్యూరో : క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయడానికి రూపొందించిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి సంబంధించిన కిట్లను ఈ నెల 26న పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అందజేయనున్నారని రాష్ట్రంలోని పార్టీ నేతలంతా తరలివచ్చి విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కోరారు. శుక్రవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. పార్టీని గ్రామ, వార్డు స్థాయిల్లో పార్టీని ఎలా బలోపేలతం చేయాలనే దానిపై చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారని, ప్రతిఒక్కరూ విధిగా హాజరుకావాలని ఆదేశించారు.

కాసానితో వాల్మీకి, బుడగజంగం, సంచార జాతుల నేతలు భేటీ

మహబూబ్ నగర్ జిల్లా నాయకుడు మెట్టుకాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాల్మీకి హక్కుల పోరాట సమితి, బేడ బుడగ జంగం హక్కుల సాధన సమితి, సంచార జాతుల జేఏసీ నాయకులు శుక్రవారం కాసానితో భేటీ అయ్యారు. సంఘీభావాన్ని, సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లను మొట్టమొదటిగా కల్పించిన పార్టీ టీడీపీ అన్నారు. బడుగు, బలహీన వర్గాలు, పేదలు, మహిళలు, మైనార్టీలు అందిరికీ సామాజిక న్యాయం టీడీపీతోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సమన్వయ కర్త కంభంపాటి రామమోహన్ రావు, వాల్మీక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మీనుగ గోపి బోయ, ఎస్సీ-బేడ బుడగ జంగం హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు గగనం వెంకట స్వామి, సంచార జాతుల జేఏసీ వైస్ చైర్మన్ చింతల సంపత్, సంఘ సంస్కర్త కె. శీలా తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed