పేపర్ లీకేజీలు ఎలా అవుతున్నాయి..?.. మల్లు రవి

by Dishafeatures2 |
పేపర్ లీకేజీలు ఎలా అవుతున్నాయి..?.. మల్లు రవి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం పకడ్భందీగా నిర్వహించాల్సిన పరీక్షల పేపర్లు ఎలా? లీకులు అవుతున్నాయని? టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన గాంధీభవన్​లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ...పేపర్ లీకేజీ అంశంలో సర్కార్ నిర్లక్ష్యం స్పష్టంగా ఉన్నదన్నారు. టెన్త్​పరీక్షల నిర్వహణ కూడా రాకపోతే ఎలా? అంటూ ప్రశ్నించారు. పేపర్ లీకేజీలపై సీబీఐ విచారణ అవసరమని పేర్కొన్నారు. ఇప్పటికే కాంగ్రెస్​పార్టీ ఫిర్యాదు చేసిందని స్పష్టం చేశారు. ప్రైవేట్,కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకే పేపర్​లీకేజ్​లు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇక కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలలో 50 శాతం కూడా పూర్తి కాలేదన్నారు. 9 ఏళ్లుగా నోటిఫికేషన్ ఇవ్వకుండా.. ఇప్పుడు ఆదరా బాదరగా ఇచ్చి పేపర్​లీకేజీలకు కారణం అవుతుందన్నారు.

పేపర్​లీకేజీపై ఎంక్వైరీ వేగంగా జరగడం లేదన్నారు. రెండు వారాల తర్వాత సిట్ ఇప్పుడు సభ్యులు, చైర్మన్​ను విచారించడం ఏందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్ట్ లో కాంగ్రెస్ వేసిన పిటిషన్ కు సమాధానం చెప్పేందుకు మాత్రమే చైర్మన్​ను విచారిస్తున్నారన్నారు. మరోవైపు టెన్త్ పేపర్ లీక్ పై కాంగ్రెస్​ నిరసన వ్యక్తం చేస్తే ఎన్​ఎస్​యూఐ కార్యకర్తలను జైల్లో పెట్టడం దారుణమన్నారు. నిరుద్యోగులు ,విద్యార్థులు అంటే ప్రభుత్వం కు ఎందుకు అలసత్వం? అని విమర్శించారు. యూత్ కాంగ్రెస్​అధ్యక్షులు శివసేనారెడ్డి మాట్లాడుతూ..మిగతా టెన్త్ పరిక్షలు సరిగ్గా నిర్వహించకపోతే..పిల్లలు, తల్లిదండ్రుల పక్షాన జైల్ భరో కార్యక్రమం తీసుకుంటామన్నారు. పదవ తరగతి పరీక్షలు అత్యంత లోపభూయిష్టంగా జరుగుతున్నాయన్నారు. ప్రతి రోజు ఒక పేపర్​లీకు అవ్వడం ఏమిటని? ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇలాంటివి జరుగుతున్నాయన్నారు. సర్కార్​వేగంగా చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యేలు, మంత్రులు ఇళ్లు ముట్టడిస్తామని పేర్కొన్నారు.



Next Story

Most Viewed