కర్ణాటక ఎన్నికల కోసం కేసీఆర్ వందల కోట్లు పంపుతున్నారు.. రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

by Dishafeatures2 |
కర్ణాటక ఎన్నికల కోసం కేసీఆర్ వందల కోట్లు పంపుతున్నారు.. రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక ఎన్నికల కోసం కేసీఆర్ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జేడీఎస్ నేత కుమారస్వామికి సీఎం కేసీఆర్ వందల కోట్ల అవినీతి సొమ్మును పంపారని ఆరోపించారు. కేసీఆర్ లక్ష కోట్ల అవినీతి సొమ్మును కూడబెట్టారన్న రేవంత్ రెడ్డి.. ఆ డబ్బుతో కాంగ్రెస్ పార్టీని అస్థిర పరిచేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.

అవినీతి సొమ్ముతో దేశ రాజకీయాలను శాసించాలని కేసీఆర్ చూస్తున్నారని, అందుకే వందల కోట్లు ఖర్చుపెట్టి బీఆర్ఎస్ ను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అమ్మి బీజేపీ సొమ్ము చేసుకుంటోందని, ఆ సొమ్ముతో ఎమ్మెల్యేలను కొని ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలగొడుతోందని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.

Read more:

కేసీఆర్ను కట్టేసి ‘బలగం’ సినిమాను చూపించాలి.. బండి సంజయ్

Next Story

Most Viewed