బీజేపీలోకి టాలీవుడ్ నటి.. ఈటల రాజేందర్‌తో భేటీ!

by Disha Web Desk 2 |
బీజేపీలోకి టాలీవుడ్ నటి.. ఈటల రాజేందర్‌తో భేటీ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన బీజేపీ ఆ దిశగా కసరత్తు వేగవంతం చేసింది. పార్టీలో సినీ గ్లామర్‌ను జోడించాలని ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు మరింత ముమ్మరం అయ్యాయి. తాజాగా ప్రముఖ సినీ నటి బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, ఈటల రాజేందర్‌తో భేటీ కావడం తెలుగు రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ టీడీపీ అధికార ప్రతినిధి, సినీ నటి దివ్యవాణి హైదరాబాద్ శామీర్ పేటలోని ఈటల నివాసానికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా తాను బీజేపీలో చేరతానని ప్రతిపాదనను ఈటల ముందు ఉంచారు. ఈ విషయాన్ని హైకమాండ్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఈటల చెప్పినట్లు తెలుస్తోంది. టీటీపీపై తీవ్ర ఆరోణలు, ఆగ్రహం వెలిబుచ్చిన దివ్యవాణి ఆ పార్టీకి ఇటీవలే గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత కొంత కాలం సైలెంట్‌గా ఉన్న దివ్యవాణి అనూహ్యంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడైనా పార్టీ కోసం పని చేయడానికి ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తోంది. కాగా, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ సినీ గ్లామర్‌ను మరింత జోడించాలని ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే జయసుధ లాంటి లేడీ స్టార్స్‌ను సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు అమిత్ షా తో జూ.ఎన్టీఆర్, జేపీ నడ్డాతో నితిన్‌ల భేటీ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. త్వరలో నిఖిల్‌తోనూ బీజేపీ నేతలు భేటీ అవుతారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో దివ్యవాణి ఈటలతో సమావేశం కావడం తెలుగు రాజకీయాల్లో అనూహ్య పరిణామంగా చెబుతున్నారు.

Also Read: లోక్ సభకు ఉపఎన్నిక? పక్కా ప్లాన్ సిద్ధం చేసిన బీజేపీ





Next Story

Most Viewed