తెలంగాణ మంత్రివర్గం అలీబాబా 40 దొంగలుగా మారింది.. తరుణ్ చుగ్

by Dishafeatures2 |
తెలంగాణ మంత్రివర్గం అలీబాబా 40 దొంగలుగా మారింది.. తరుణ్ చుగ్
X

దిశ, వెబ్ డెస్క్: కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ మండిపడ్డారు. రాష్ట్ర మంత్రి వర్గం అలీబాబా 40 దొంగలుగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పోలీసులు మొబైల్ పోలీసులుగా మారారని, కేసీఆర్ కు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీఎస్పీస్సీ పేపర్ లీక్ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే కేసీఆర్ ఈ నాటకానికి తెరతీశారని అన్నారు. టెన్త్ క్లాస్ పేపర్ కేసులో బండి సంజయ్ ను అక్రమంగా ఇరికించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఎంపీని వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని తరుణ్ చుగ్ ప్రశ్నించారు. అర్థరాత్రి బండి సంజయ్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. బండి సంజయ్ ఫోన్ ను పోలీసులే దొంగిలించారని ఆరోపించారు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో మరో పార్టీ ఉండకూడదన్నదే కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed