- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగన్ ప్రభుత్వంపై మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
by Javid Pasha |
ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకీ, తెలంగాణకు భూమికి ఆకాశానికి మధ్య ఉన్నంత తేడా ఉందని అన్నారు. సంగారెడ్డిలో జరిగిన ఫూలే జయంతి ఉత్సవాల్లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో ఎవరి పాలన బాగుందని అడిగారు. తెలంగాణతో ఏపీ ఏ విషయంలో పోటీ కాదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కార్మికుల కోసం పాటుపడుతోందని స్పష్టం చేశారు. తెలంగాణలో ఉన్న ఆంధ్రా కార్మికులు ఏపీలో ఓటు రద్దు చేసుకొని తెలంగాణలో నమోదు చేసుకోవాలని సూచించారు. వచ్చే మే ఒకటో తారీఖున (మే డే రోజున) కార్మికులు సీఎం కేసీఆర్ నుంచి శుభవార్త వింటారని హరీశ్ రావు అన్నారు.
Next Story






