టీడీపీ రాష్ట్ర మహిళా కమిటీ నియామకం

by Dishafeatures2 |
టీడీపీ రాష్ట్ర మహిళా కమిటీ నియామకం
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీడీపీ రాష్ట్ర మహిళా కమిటీని 36మందితో నియమించారు. ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ప్రకటించారు. నియామక ఉత్తర్వులను జారీ చేశారు. ఉపాధ్యక్షులు ఏడుగురు, ప్రధానకార్యదర్శులు 8మంది, అధికార ప్రతినిధులుగా 6గురిని నియమించారు. ఉపాధ్యక్షులుగా కానూరి జ‌య‌శ్రీ, పోట్రూ సరస్వతి, సూర్యదేవ‌ర ఝాన్సీ, చ‌ల‌సాని ఝాన్సీ, పూతి కృష్ణవేణి రెడ్డి, అన‌సూయ నాయ‌క్, గుల్లపల్లి లావణ్య, ప్రధాన కార్యద‌ర్శులుగా దాసరి మాల్యావ‌తి, తల్లికోట ఆశాబిందు, నందిమ‌ల్ల శార‌ద, దూడల నిర్మల గౌడ్, ష‌రీఫా, ఆరేం వ‌ర‌ల‌క్ష్మి, నూజిట్టి వాణి, మంకు ఇందిర నియామకం అయ్యారు.

ఇక అధికార ప్రతినిధులుగా తలారి సావిత్రి, యాండ్ర క‌ల్పన, మాచెర్ల ప్రతిభ, సుజాత సంధ్యపోగు, రాజ రాజేశ్వరీ, రామచంద్రమ్మ, కార్య నిర్వాహక కార్యద‌ర్శులుగా సిద్ధాంతం అనురాధ, కాకరాల శ‌శిరేఖ, పసునూరి సీతమ్మ, తగిరిస ల‌లిత చౌద‌రి, మేడిప‌ల్లి రాణి, కూరపాటి వసుంధర, కార్యాలయ కార్యదర్శిగా ఉప్పల శాంతి, కార్యద‌ర్శులుగా అన్నమ్మ, హేమ‌ల‌త, సీలం ర‌త్నం, విజ‌యానంద కుమారి, అల్లం శివ‌మణి, మొగుడాల పార్వతమ్మ, మాధవి యాదవ్, వట్టినేని సురేఖ నియామకం అయ్యారు.


Next Story

Most Viewed