ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అందుకే కొట్టినా.. నిందితుడి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 3 |
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అందుకే కొట్టినా.. నిందితుడి సంచలన వ్యాఖ్యలు
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి జరిగిన విషయం అందరికి తెలిసిందే. కాగా ఈ ఘటనలో అనుమానితులుగా ఉన్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేయగా.. అందులో ఒకరు తానే జగన్‌పై దాడి చేసినట్లు ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. క్వార్టర్ మద్యం 350 రూపాయల డబ్బులు ఇస్తానంటే సీఎం సభకు వచ్చానని నిందితుడు సతీష్ పేర్కొన్నారు.

అయితే వైసీపీ మాటలు నమ్మి సభకు వచ్చిన తనకు మద్యం మాత్రమే ఇచ్చి డబ్బులు ఇవ్వలేదేని తెలిపారు. డబ్బులు ఇవ్వలేదనే అక్కసుతోనే తాను జగన్మోహన్ రెడ్డిని రాయితో కొట్టినట్లు తెలిపారు. కాగా సతీష్‌కు తెలుగుదేశం పార్టీతో ఏవైనా లింకులు ఉన్నాయా అనే కోణాన్ని కనుగొనడానికి పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని.. జనాలను కొనటం అలవాటే కదా, 2-3 లక్షలు పడేయండి ఎన్నాళ్లు పేటియం వెధవలకే ఇస్తారురా సైకో అంటూ సోషల్ మీడియాలో నిందితుడు చెప్పిన విషయాలు అనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది. నిజంగానే ఈ వ్యాఖ్యలు నిందితుడు చేశారా..? లేక వైసీపీ హేటర్స్ చేస్తున్న ప్రచారమా..? అనే విషయం తెలియాల్సి ఉంది.


Next Story