మోడీని పొగడ్తలతో ముంచెత్తిన కాంగ్రెస్ సీఎం

by Dishafeatures2 |
మోడీని పొగడ్తలతో ముంచెత్తిన కాంగ్రెస్ సీఎం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీని కాంగ్రెస్ కు చెందిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పొగడ్తల్లో ముంచెత్తారు. దాదాపు రూ.5,500 కోట్లు విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థానప చేసేందుకు పీఎం మోడీ బుధవారం రాజస్థాన్ లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి గవర్నర్ కల్ రాజ్ మిశ్రా, సీఎం అశోక్ గెహ్లాట్ పీఎం మోడీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం నాథ్‌ద్వారాలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టు పనుల శంకుస్థాపన కోసం రాష్ట్రానికి ప్రధాని మోడీ రావడం ఆనందంగా ఉందన్నారు. రాజస్థాన్ లో చాలా పనులు జరిగాయని చెప్పారు. గతంలో అభివృద్ధి విషయంలో గుజరాత్ కంటే వెనుకబడి ఉన్నామనే అభిప్రాయం ఉండేదని, కానీ ఇప్పుడు గుజరాత్ కు సమానంగా రాజస్థాన్ లోనూ అభివృద్ధి జరుగుతోందని తెలిపారు.



Next Story