మహిళా బిల్లు కోసం బీఆర్ఎస్ పోరాటం.. ఎమ్మెల్సీ కవిత

by Dishafeatures2 |
మహిళా బిల్లు కోసం బీఆర్ఎస్ పోరాటం.. ఎమ్మెల్సీ కవిత
X

దిశ, తెలంగాణ బ్యూరో : మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీఆర్ఎస్ పోరాటం చేయనుందని, పార్టీ ఎంపీలు పార్లమెంటులో సైతం పోరు చేస్తారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడంలో మోడీ ఎలాంటి చొరవ తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీని విస్మరించిందని విమర్శించారు. శుక్రవారం ఢిల్లీలో రష్యా ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ స్ఫూత్నిక్ తో మాట్లాడారు. రాజకీయ రంగంలో మహిళల ప్రాతినిధ్యం పెరుగితేనే దేశం సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. బీజేపీ 2014 ఎన్నికల ముందు మహిళా రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ఇచ్చిన హామీని విస్మరించిందని విమర్శించారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎత్తిడి చేస్తున్నా కేంద్రం పెడచెవిన పడుతుందన్నారు. తొలిసారి మహిళా రిజర్వేషన్ బిల్లును 1996లో అప్పటి ప్రధాని దేవెగౌడ పార్లమెంట్లో ప్రవేశపెట్టారని, ఆ తర్వాత వచ్చిన ప్రధాన మంత్రులు ఈ బిల్లును ఆమోదించడానికి ప్రయత్నాలు చేశారని గుర్తు చేశారు. కానీ మోడీ మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చేందుకు ఏ మాత్రం చొరవ చూపలేదని మండిపడ్డారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించడంలో రాజకీయ చిత్తశుద్ధి అవసరమన్నారు.

రిజర్వేషన్ కోటాలో కోటా కావాలని కొన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం పెడుతున్నాయని, ఇటువంటి సమస్యలను పరిష్కరించడానికి తమ పార్టీ కేంద్రానికి సూచనలు ఇచ్చిందని తెలిపారు. కులగణను చేపట్టి ఓబీసీ జనాభా లెక్క తీయాలని డిమాండ్ చేశారు. జనాభా లెక్కలతో రిజర్వేషన్ల అమలు సులభతరం అవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటింటీ సర్వే నిర్వహించి కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించామని తెలిపారు.

Next Story

Most Viewed