అభివృద్ధి జరగలేదని నిరూపిస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటా : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

by Disha Web Desk 11 |
అభివృద్ధి జరగలేదని నిరూపిస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటా : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
X

దిశ, జడ్చర్ల: ‘జడ్చర్ల నియోజకవర్గంలో తన హయాంలో అభివృద్ధి జరగలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. అదే నిజమని నిరూపిస్తే వచ్చే ఎన్నికల నుంచి తప్పుకుంటా.. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేల హయాంలో జడ్చర్ల అభివృద్ధి జరగలేదని నేను నిరూపిస్తే అంబేద్కర్ సాక్షిగా ముక్కు నేలకు రాస్తావా రేవంత్ రెడ్డి ’ అని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. జడ్చర్ల మండల పరిధిలోని కోడుగల్ గ్రామంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

గ్రామంలో గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల జడ్చర్ల లో జరిగిన కాంగ్రెస్ సభలో జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల హయాంలోనే జడ్చర్ల నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని రేవంత్ రెడ్డి మాట్లాడారని.. నిజంగా జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి జరిగిందని నమ్మకం ఉంటే రేవంత్ రెడ్డి తన సవాళ్లను స్వీకరించాలని అన్నారు. గత కాంగ్రెస్ పాలనను ప్రస్తుత బీఆర్ఎస్ పాలనను ప్రజల ముందు పెడదామని ఏ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉందో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు.



Next Story

Most Viewed