ప్రగతి యాత్రతో ప్రజలను మోసం చేస్తున్న ఎమ్మెల్యే : మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్

by Disha Web Desk 11 |
ప్రగతి యాత్రతో ప్రజలను మోసం చేస్తున్న ఎమ్మెల్యే : మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్
X

దిశ, కుత్భుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రగతి యాత్ర పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆరోపించారు. గురువారం ‘కుత్బుల్లాపూర్ గోస -శ్రీశైలం అన్న భరోసా’ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే గాజులరామారం డివిజన్ లోని చంద్రగిరి నగర్, అంబేద్కర్ నగర్, ఉమాదేవి నగర్ బస్తీలలో స్థానిక బిజెపి నాయకులతో కలిసి పాదయాత్ర చేశారు. ప్రజలు స్థానిక సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చంద్రగిరి నగర్ లో పూర్తిగా ధ్వంసమైన రోడ్డును పరిశీలించారు. అంబేద్కర్ నగర్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు.

బస్తీలలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు కోటి ఎనబై లక్షలతో ఉమాదేవి నగర్ లో పలు అభివృద్ధి పనులు చేపట్టానని గుర్తు చేశారు. ఇప్పటికీ అవే రోడ్లు, డ్రైనేజీలు ఉన్నాయని, తొమ్మిదేళ్లుగా ఎమ్మెల్యే వివేక్ చేసిందేమి లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం రాగానే బస్తీల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేకేఎం ట్రస్ట్ చైర్మన్, బీజేపీ నాయకుడు కూన శ్రీనివాస్ గౌడ్, బిజెపి అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి, అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ రాము గౌడ్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు గరిగే శేఖర్ ముదిరాజ్, డివిజన్ ఇంచార్జులు కృష్ణ యాదవ్, రాజిరెడ్డి, బిల్లా వెంకటేష్, జగద్గిరిగుట్ట డివిజన్ అధ్యక్షుడు పున్నారెడ్డి, డివిజన్ నాయకులు సునీల్ పాటిల్, జ్ఞానేశ్వర్, సంతోష్, సుఖ్ దేవ్, సంతోష్, రామ్ నర్సయ్య, కృష్ణమూర్తి, కావలి శ్రీను, పద్మ, కల్పనా రెడ్డి, రాధికా తదితరులు పాల్గొన్నారు.

Next Story