- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పవన్ కల్యాణ్కు ప్రాణహాని.. కేఏ పాల్కు ముందే తెలుసా?
దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజకీయాల్లో వేగాన్ని పెంచారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ క్రమంలోనే ఆయన వారాహి యాత్ర చేపట్టారు. అయితే ఈ యాత్రలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని అన్నారు. కాగా తాజాగా పవన్ వ్యాఖ్యలపై ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ స్పందించారు. పవన్ కల్యాణ్ కు ప్రాణహాని ఉందని తాను వారం రోజుల ముందే చెప్పానన్నారు. సీబీఐ, ఐపీ, ఎఫ్ బీ వంటి సంస్థల్లో తనకు మిత్రులు ఉన్నారని, వారి ద్వారా నాకు పవన్ కల్యాణ్ కు ప్రాణహాని ఉందనే విషయం తెలిసిందని అన్నారు. ఇక పవన్ కల్యాణ్ వారాహి యాత్రపై కేఏ పాల్ మాట్లాడుతూ.. అది వారాహి యాత్ర కాదు నారాహి యాత్ర అని విమర్శించారు.
చంద్రబాబును మళ్లీ సీఎం చేయడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారని, అసలు తానెందుకు సీఎం కావాలని కోరుకోవడం లేదని పాల్ అన్నారు. తెలుగు రాష్ట్రాలు నాశనం కావడానికి ప్రధాన కారణమైన బీజేపీకి పవన్ కల్యాణ్ ఎందుకు సపోర్టు చేస్తున్నారని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ తనకు తమ్ముడిలాంటివాడని, తన నుంచి ఎన్నోసార్లు ఆశీర్వాదం తీసుకున్నారని కేఏ పాల్ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
వద్దు వద్దు అంటున్నా విసిగించిన హీరో.. చెంప చెల్లుమనిపించిన మెగాస్టార్