- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సస్పెన్షన్ ఎత్తివేతపై ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
దిశ ప్రతినిధి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై బీజేపీ అధిష్టానం విధించిన సస్పెన్షన్ ఎత్తివేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సైతం రాజాసింగ్ పై సస్పెన్షన్ తొలగిస్తామని చెప్పారు. బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రాజాసింగ్ విషయంలో స్పందించి సస్పెన్షన్ తొలగింపు విషయమై పార్టీ అధిష్టానానికి సిఫారసు చేసినట్లు ప్రకటించారు. ఈ విశయమై దిశ ప్రతినిధి ఎమ్మెల్యే రాజాసింగ్ తో మాట్లాడారు.
సుమారు మూడు నాలుగు నెలలుగా ఇదే మాట చెబుతున్నారు.. సస్పెన్షన్ ఎత్తివేస్తామని అంటున్నారు కానీ ఎత్తివేయడం లేదని ఆయన అన్నారు. తిరిగి పార్టీలో చేర్చుకుంటున్నట్లు గానీ, సస్పెన్షన్ తొలగిస్తున్నామని తనకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని రాజాసింగ్ తెలిపారు. తాను ఎల్లప్పుడు బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తానన్నారు..
Also Read..
ఇప్పుడు ఎన్నికలు వచ్చినా 105 సీట్లు గెలుస్తాం.. సీఎం కేసీఆర్