ప్రజావేదిక కూల్చివేతకు నాలుగేళ్లు పూర్తి.. టీడీపీ అధినేత చంద్రబాబు

by Dishafeatures2 |
ప్రజావేదిక కూల్చివేతకు నాలుగేళ్లు పూర్తి.. టీడీపీ అధినేత చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రజా వేదిక కూల్చివేతకు నేటితో నాలుగేళ్లు పూర్తయ్యయాని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజావేదిక కూల్చివేత వైసీపీ అరాచక పాలనకు అద్దం పడుతోందని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ప్రజావేదిక కూల్చివేత వీడియోలను పోస్టు చేశారు. కాగా 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్రమ కట్టడమంటూ గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్టపై నిర్మించిన ప్రజావేదికను కూల్చివేసింది. అయితే ప్రజావేదికను అక్రమ కట్టడంగా పేర్కొంటూ కూల్చివేసిన జగన్ ప్రభుత్వం.. ఆ తర్వాత అదే ప్రాంతంలోని మిగతా అక్రమ కట్టడాల జోలికి మాత్రం వెళ్లలేదు. దీంతో చంద్రబాబును వేధించడానికే జగన్ ప్రజావేదికను కూల్చివేయించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.

Also Read..

చంద్రబాబు బ్లాక్ కమెండో సెక్యూరిటీపై.. తమ్మినేని సంచలన కామెంట్స్



Next Story

Most Viewed