Telangana MP Election: తెలంగాణ ఎన్నికల బరిలో దోశల వేడి

by Disha Web Desk 3 |
Telangana MP Election: తెలంగాణ ఎన్నికల బరిలో దోశల వేడి
X

దిశ వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి నెలకొంది. ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగారు. వీరిలో ఎక్కువ మంది తమ సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదనే కారణంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కాగా తెలంగాణలోనూ ఇలా ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఉన్నారు.

వివరాల్లోకి వెళ్తే.. మల్కాజిగిరికి చెందిన చిరిపిరెడ్డి రమేశ్ అనే యువకుడు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించనా అతనికి ప్రభుత్వ ఉద్యోగం రాలేదు. ఈ నేపథ్యంలో అతను చైతన్యపురిలో రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ ప్రారంభించారు. అయితే ఆ టిఫిన్ సెంటర్ ఫుట్‌పాత్‌పై ఉందని పోలీసులు దాన్ని మూసేశారు. లైసెన్స్ ఉన్నప్పటికీ తనతోపాటుగా వెయ్యి మంది వ్యాపారాలను మూసేశారు. ఈ క్రమంలో తమ సమస్యను ప్రభుత్వానికి తెలపాలనే ఉద్దేశంతో చిరిపిరెడ్డి రమేశ్ ఎన్నికల బరిలో నిలిచారు.

Next Story

Most Viewed