ఢిల్లీ లిక్కర్ కేసు: 5 రోజుల సీబీఐ కస్టడీకి మనీశ్ సిసోడియా

by Dishafeatures2 |
ఢిల్లీ లిక్కర్ కేసు: 5 రోజుల సీబీఐ కస్టడీకి మనీశ్ సిసోడియా
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ ఐదు రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో మనీశ్ సిసోడియాను కీలక నిందితుడిగా పేర్కొంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఆదివారం ఆయనను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. సోమవారం మనీశ్ సిసోడియాను రౌజ్ అవెన్యూ కోర్టులో సీబీఐ ప్రవేశపెట్టింది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీశ్ సిసోడియాది కీలక పాత్ర అని, ఈ కేసులో విచారించడానికి మనీశ్ సిసోడియాను 5 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ కోర్టును కోరింది. తొలుత మనీశ్ రిమాండ్ ను రిజర్వ్ చేసిన కోర్టు.. తుది వాదనలు విన్న తర్వాత మనీశ్ ను సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ తీర్పునిచ్చింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story