- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఢిల్లీ లిక్కర్ కేసు: 5 రోజుల సీబీఐ కస్టడీకి మనీశ్ సిసోడియా
by Dishafeatures2 |
X
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ ఐదు రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో మనీశ్ సిసోడియాను కీలక నిందితుడిగా పేర్కొంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఆదివారం ఆయనను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. సోమవారం మనీశ్ సిసోడియాను రౌజ్ అవెన్యూ కోర్టులో సీబీఐ ప్రవేశపెట్టింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీశ్ సిసోడియాది కీలక పాత్ర అని, ఈ కేసులో విచారించడానికి మనీశ్ సిసోడియాను 5 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ కోర్టును కోరింది. తొలుత మనీశ్ రిమాండ్ ను రిజర్వ్ చేసిన కోర్టు.. తుది వాదనలు విన్న తర్వాత మనీశ్ ను సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ తీర్పునిచ్చింది.
Next Story