దారుణ హత్యకు గురైన తండ్రి.. ఉప ఎన్నికల బరిలో కూతురు దీపాలీ

by Disha Web Desk 2 |
దారుణ హత్యకు గురైన తండ్రి.. ఉప ఎన్నికల బరిలో కూతురు దీపాలీ
X

దిశ, వెబ్‌డెస్క్: పోలీస్ అధికారి కాల్పుల్లో ఒడిశా మంత్రి నబా కిషోర్ దాస్ మరణించిన విషయం తెలిసిందే. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రిపై పోలీస్ అధికారి కాల్పులు జరిపాడు. మంత్రి కిషోర్ దాస్ తన కారు నుంచి దిగినప్పుడు దగ్గర్లోంచి ఆయనపై కాల్పులు జరిపాడు. వెంటనే మంత్రిని ఆసుపత్రికి తరలించగా అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. అయితే వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ మంత్రి ఆరోగ్యం మెరుగుపడలేదు.

గాయాల తీవ్రత అధికంగా ఉండడంతో మంత్రి నబా మరణించారని వైద్యులు ప్రకటించారు. దీంతో నబా కిషోర్ దాస్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఝార్సుగూడ అసెంబ్లీ స్థానానికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో హత్యకు గురైన మాజీ మంత్రి నబా కిషోర్‌ దాస్‌ కూతురు దీపాలీ దాస్‌ పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఝార్సుగూడ టికెట్‌ను ఆమెకు ఖరారు పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story

Most Viewed