- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీజేపీ నేతలను నిలదీసిన సీపీఐ నారాయణ
దిశ, తిరుపతి: తిరుపతి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ నేతలను తిరుపతి ప్రజలు చీ కొట్టాలని, రాష్ట్ర గవర్నర్ అభివృద్ధి వైపు స్పందించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. టీటీడీ వారు తిరుపతికి కేటాయించిన 1 శాతం నిధులపై జిల్లాలో, రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న ధర్నాలు గవర్నర్కు అర్జీలు ఇవ్వడాన్ని నారాయణ తీవ్రంగా తప్పుబట్టారు.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. మూర్ఖత్వపు విశ్వహిందూ పరిషత్, బీజేపీ నేతలు తిరుపతి అభివృద్ధి నిరోధక శక్తులుగా ఉన్నారని, వీరి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తిరుమలకు భక్తులు రోజూ లక్షకు పైగా వస్తుంటారని తిరుపతి ఎంత అందంగా ఉంటే భక్తులు అంత ఆనంద పడతారని తెలిపారు. తిరుపతి అభివృద్ధికి రూ.4 వేల కోట్ల ఆదాయంలో 1 శాతం అంటే కేవలం రూ. 40 కోట్లు మాత్రమేనని, ఇది ఏ మాత్రం సరిపోదని అవసరమైతే తిరుపతి మౌళిక సదుపాయాల కోసం 5 శాతం నిధులు కేటాయిస్తే మంచిదని ఆయన డిమాండ్ చేశారు.