లలిత్ మోడీ, నీరవ్ మోడీ ఓబీసీలు కారు.. కాంగ్రెస్ నేత శశి థరూర్

by Dishafeatures2 |
లలిత్ మోడీ, నీరవ్ మోడీ ఓబీసీలు కారు.. కాంగ్రెస్ నేత శశి థరూర్
X

దిశ, వెబ్ డెస్క్: లలిత్ మోడీ, నీరవ్ మోడీ ఓబీసీలు కారని కాంగ్రెస్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ అన్నారు. ఓ మీడియా ఛానెల్ డిబేట్ లో పాల్గొన్న ఆయన ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. 2019 కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ మాట్లాడింది గుజరాత్ లోని మోడీలందరి గురించి కాదని.. లలిత్ మోడీ, నీరవ్ మోడీల గురించి అని స్పష్టం చేశారు. కానీ బీజేపీ దాన్ని వక్రీకరించిందని అన్నారు. రాహుల్ గాంధీ చేసింది చిన్న తప్పేనన్న ఆయన.. ఎన్నికల సభల్లో ప్రధాని మోడీతో పాటు ఇతర సీనియర్ నేతల ఉపన్యాసాలు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు.

Next Story

Most Viewed