రాష్ట్ర అధ్యక్షుడు చెప్పులు మోయడమేంటి.. Addanki Dayakar ఆగ్రహం

by Disha Web Desk 2 |
రాష్ట్ర అధ్యక్షుడు చెప్పులు మోయడమేంటి.. Addanki Dayakar ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ఆలయ నుంచి బయటకు వచ్చిన అమిత్ షా కు బండి సంజయ్ చెప్పులు అందించడం దుమారం రేపుతోంది. దీనిపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ స్పందించారు. ఈ సందర్భంగా అద్దంకి మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ బానిసలను తయారు చేస్తోందని మండిపడ్డారు. గుజరాతీ నేతలకు టీ-బీజేపీ నేతలు గులాంలుగా మారిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని బండి సంజయ్ అమిత్ షా కాళ్ల దగ్గర పెట్టారని విమర్శించారు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, ఒక ఎంపీ అయిన బండి సంజయ్ చెప్పులు మోయడమేంటని ప్రశ్నించారు. ఈ ఘటన బీజేపీ మానసిక స్థితికి అద్దం పడుతోందని అన్నారు.

Next Story

Most Viewed