రాష్ట్రంలో దారుణం.. బీజేపీ లీడర్ దారుణ హత్య!

by Sujitha Rachapalli |

బీహార్‌లో దారుణం చోటు చేసుకుంది. బీజేపీ నాయకుడు సురేంద్ర కేవట్‌ను అర్ధరాత్రి దారుణంగా కాల్చి చంపారు దుండగులు. షేక్‌పుర గ్రామంలో పొలం పనిచేస్తుండగా ఈ దాడి జరిగింది. మోటార్‌సైకిల్‌పై వచ్చిన

రాష్ట్రంలో దారుణం.. బీజేపీ లీడర్ దారుణ హత్య!
X

దిశ, వెబ్ డెస్క్: బీహార్‌లో దారుణం చోటు చేసుకుంది. బీజేపీ నాయకుడు సురేంద్ర కేవట్‌ను అర్ధరాత్రి దారుణంగా కాల్చి చంపారు దుండగులు. షేక్‌పుర గ్రామంలో పొలం పనిచేస్తుండగా ఈ దాడి జరిగింది. మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దోషులు పరారీలో ఉండగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా పాట్నాలో వరుస హత్యలు జరగడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుందని ప్రశ్నించారు ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్. ఈ ఘటనను జేడీయూ-బీజేపీ ప్రభుత్వంలో జంగిల్ రాజ్‌కు నిదర్శనంగా పేర్కొన్నారు.

Next Story