మీకో న్యాయం మాకో న్యాయమా?... బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

by Dishafeatures2 |
మీకో న్యాయం మాకో న్యాయమా?... బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
X

దిశ, వెబ్ డెస్క్: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వం మరోసారి విరుచుకుపడ్డారు. మణిపూర్ అల్లర్లపై స్పందించిన ఆమె.. కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. మణిపూర్ లో చెలరేగినట్లు బెంగాల్ లో అల్లర్లు చెలరేగితే కేంద్ర ప్రభుత్వం ఊరుకునేదా అని ప్రశ్నించారు. వందల కొద్దీ కేంద్ర బృందాలను పంపి కేంద్ర ప్రభుత్వం తమ ప్రభుత్వాన్ని బద్నాం చేసేదని అన్నారు. మీకో న్యాయం మాకో న్యాయమా అని దీదీ ప్రశ్నించారు. మణిపూర్ అల్లర్లలో ఎంతమంది చనిపోయారనే లెక్కలను అక్కడి ప్రభుత్వ బహిర్గతం చేయట్లేదని విమర్శించారు. దాదాపు 60 నుంచి 70 మంది వరకు చనిపోయినట్లు చెబుతున్నారని అన్నారు. మణిపూర్ నుంచి 18 మంది విద్యార్థులను బెంగాల్ కు సురక్షితంగా తీసుకొచ్చినట్లు దీదీ తెలిపారు. కాగా అల్లర్లలో చనిపోయినవారికి దీదీ సంతాపం తెలియజేశారు.

Next Story

Most Viewed