- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మహిళా ప్రజాప్రతినిధుల స్థానంలో భర్తల హాజరు..!
by Disha Web Desk 11 |
X
దిశ, ఆమనగల్లు: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు మండల స్థాయి సమావేశంలో మహిళా సర్పంచ్ ల స్థానంలో వారి భర్తలు హాజరవడం గమనార్హం. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన మహిళల స్థానంలో వారి భర్తలు లేదా కుటుంబ సభ్యులు అధికారిక సమావేశాలకు హాజరవడం నిబంధనలకు విరుద్ధమని పంచాయతీరాజ్ కమిషనర్ హెచ్చరించినప్పటికీ భర్తల పెత్తనం ఆగడం లేదు.
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల మండల స్థాయి అవగాహన సమావేశంలో మహిళా ప్రజాప్రతినిధుల స్థానంలో వారి భర్తలు పాల్గొనగా అధికారులు సైతం మౌనం వహించి, సభను నిర్వహించడంతో మండల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు
Next Story