కాంగ్రెస్ వలె బీజేపీ అంతమౌతుంది.. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్

by Dishafeatures2 |
కాంగ్రెస్ వలె బీజేపీ అంతమౌతుంది.. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్
X

కోల్‌కతా: సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసిన కాంగ్రెస్ మాదిరి రాబోయే రోజుల్లో బీజేపీ కథ కూడా ముగుస్తుందని అన్నారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రంపై ఆయన మండిపడ్డారు. కుల గణన చేపట్టాలని నొక్కి చెప్పారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఇది ప్రధాన సమస్య అని అన్నారు. కాంగ్రెస్ గతంలో కేంద్ర సంస్థలను ఉపయోగించుకుందని, ప్రస్తుతం బీజేపీ ఇదే చేస్తుందని విమర్శించారు.

త్వరలో కాంగ్రెస్ కు పట్టిన గతే కాషాయపార్టీకి పడుతుందని మండిపడ్డారు. కులగణన విషయంలో కాంగ్రెస్ మాదిరి బీజేపీ కూడా పక్కకు పెట్టిందని చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపాదిత ప్రతిపక్ష ఫ్రంట్ ఫార్ములా ఏంటని అడగ్గా.. బహిర్గతం చేయమని యాదవ్ చెప్పారు. ప్రతిపక్ష ఫార్ములాను బయటపెట్టమని, బీజేపీని ఓడించడమే లక్ష్యమని అన్నారు.




Next Story