ఏపీలో కొత్త పార్టీకి శ్రీకారం.. వివరాలు ప్రకటిస్తానన్న సినీ గేయ రచయిత జొన్నవిత్తుల

by Dishafeatures2 |
ఏపీలో  కొత్త పార్టీకి శ్రీకారం.. వివరాలు ప్రకటిస్తానన్న సినీ గేయ రచయిత జొన్నవిత్తుల
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతుంది. తెలుగు భాషా పరిరక్షణ కోసం ‘జై తెలుగు’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు కాబోతుంది. సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఈ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. రాజకీయ నాయకులకు, ప్రజలకు సరైన అవగాహన కల్పించడమే తమ పార్టీ లక్ష్యమని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని ప్రజలను చైతన్యవంతులను చేయడానికే పార్టీని పెడుతున్నట్లు వెల్లడించారు. విజయవాడలో మంగళవారం ప్రెస్ మీట్ పెట్టి ఈ కొత్త పార్టీ అంశాన్ని ప్రకటించారు. తెలుగు భాషకు పునర్‌ వైభవం తీసుకురావాలన్నదే తన సంకల్పమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు భాష, పరిరక్షణ అజెండాతో రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్ట్ 15 నాటికి తమ పార్టీ విధివిధానాలు ప్రకటిస్తామని వెల్లడించారు.

రాష్ట్ర విభజన అనంతరం ఏపీ తీవ్రంగా నష్టపోయిందని జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అన్నారు. ‘జై తెలుగు’ పేరుతో ఐదు రంగులతో పతాకాన్ని రూపొందించినట్లు తెలిపారు. నీలం,జలం, పచ్చ, వ్యవసాయం, ఎరుపు రంగు.. శ్రమశక్తి, పసుపు.. వైభవానికి, తెలుపు.. స్వచ్ఛతకు చిహ్నంగా రూపొందించినట్లు సినీ గేయ రచయిత జొన్న విత్తుల రామలింగేశ్వరరావు స్పష్టం చేశారు. తెలుగు భాష రథాన్ని ప్రజలు లాగాలనేది తన ఆకాంక్ష అని సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు స్పష్టం చేశారు. తెలుగు భాష కోసం గిడుగు రామ్మూర్తి నాయుడు, కందుకూరి వీరేశలింగం పంతులు, పొట్టి శ్రీరాములు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ ఎంతో పాటుపడ్డారని తెలిపారు. తెలుగు భాష కోసం ఎంతో త్యాగాలు చేశారని అన్నారు.

ఒకప్పుడు మదరాసీలు అన్నారని..ఇప్పుడు హైదరాబాదీలు అనిపించుకుంటున్నామని సినీ గేయ రచయిత జొన్న విత్తుల రామలింగేశ్వరరావు వెల్లడించారు. కానీ తెలుగు వాళ్లం అని మాత్రం అనిపించులేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మన తెలుగు భాషను మనమే విస్మరించి చులకన చేసుకుంటున్నామని వ్యాఖ్యానించారు. తెలంగాణ భాష మొత్తం ఒక్కటేనని కానీ ఏపీలో మాత్రం ప్రాంతాల వారీగా భాష మారిపోతుందని సినీ గేయ రచయిత జొన్న విత్తుల రామలింగేశ్వరరావు అన్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఇటీవలే కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు పారిశ్రామిక వేత్త రామచంద్ర యాదవ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని మెజారిటీ ప్రజల కోరికల మేరకు నూతన పార్టీని ఆవిర్భావం అవుతుందని ప్రకటించారు.వైసీపీ,టీ

Next Story

Most Viewed