అనవసరంగా రోడ్డెక్కితే వాహనం సీజ్

by  |
అనవసరంగా రోడ్డెక్కితే వాహనం సీజ్
X

దిశ, నిజామాబాద్: లాక్‌‌డౌన్‌ పొడిగింపు నేపథ్యంలో రాకపోకలపై ఆంక్షలను జిల్లా పోలీసులు మరింత కఠినతరం చేశారు. అవసరంగా రోడ్లపైకి వస్తున్న వాహనాలను సీజ్ చేస్తున్నారు. మాస్కులు ధరించకపోతే జరిమానా విధిస్తున్నారు. బైక్‌పై ఒక్కరు, కారులో ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే ఆ వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఎదుట వాహనాలను తనిఖీ చేశారు. పోలీస్ కమిషనర్ కార్తికేయ, డీసీపీ రఘు వీర్, ఉషా విశ్వనాధ్, ఎసీపీ శ్రీనివాస్ కుమార్‌లు తనిఖీల్లో పాల్గొన్నారు.

Tags: vehicle cheking, nizamabad, ts news


Next Story

Most Viewed