మానవత్వం చాటుకున్న ఎంటీవో స్పర్జన్ రాజ్

by  |
మానవత్వం చాటుకున్న ఎంటీవో స్పర్జన్ రాజ్
X

దిశ, నల్లగొండ: వలస కూలీల పట్ల ఎంటీవో స్పర్జన్ రాజ్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో జిల్లా పోలీసులు సొంత ఖర్చులతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వారికి స్పర్జన్ రాజ్ తనవంతు చేయూతనందించారు. కొద్దిరోజులుగా చేపడుతున్న అన్నదాన కార్యక్రమానికి ఆర్థికసాయం చేశారు. అలాగే, ప్రభుత్వాస్పత్రిలోని రోగులతోపాటు నార్కట్ పల్లి, చిట్యాల రోడ్ల వెంట వెళ్తున్న వలస కూలీలకు ఆదివారం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ కానిస్టేబుల్స్ కిషన్ కుమార్, హఫీజ్, సైదులు, కరుణాకర్, ఎం.టి విభాగం సిబ్బంది లియాఖత్, ఆర్ఎస్సై కళ్యాణ్ రాజ్, కానిస్టేబుల్స్ జయబాబు, జగదీశ్, శేఖర్, సాయి, శివ తదితరులు పాల్గొన్నారు.

Tags: migraint workers, nallagonda, food distribution, police


Next Story

Most Viewed