మావోల పిలుపు.. పోలీసులు అప్రమత్తం

by  |
మావోల పిలుపు.. పోలీసులు అప్రమత్తం
X

దిశ, వెబ్‌డెస్క్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటవీ ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల బంద్ పిలుపుతో అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో భారీ మొత్తంలో మోహరించారు. వాహనాల తనిఖీలు కూడా చేపడుతున్నారు. మావోయిస్టులను పోలీసులు హతమార్చిన నేపథ్యంలో బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యారు.

Next Story