డ్రగ్​ కేసులో టాలీవుడ్ యంగ్ హీరోకు పోలీసుల నోటీసులు..

by  |
డ్రగ్​ కేసులో టాలీవుడ్ యంగ్ హీరోకు పోలీసుల నోటీసులు..
X

దిశ, వెబ్ డెస్క్ : కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ కేసులో పలవురు బాలీవుడ్, శాండల్ వుడ్ నటులు పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో తనీష్‌కు బెంగళూరు పోలీసులు నోటీసులు పంపారు. ఓ డ్రగ్ కేసుకు సంబంధించి తనీశ్‌ను ఈరోజు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. డ్రగ్స్ కేసు విచారిస్తున్న బెంగళూరులోని బాణసవాడి ఉపవిభాగం పోలీసులు.. టాలీవుడ్ నటుడు తనీష్‌తోపాటు మరో ఐదుగురికి శనివారం విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. వీరిలో ఓ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత తదితరులు ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

ఈ డ్రగ్స్ కేసులో పోలీసులు ఇప్పటికే.. ఇద్దరు విదేశీయులను అరెస్టు చేసి విచారించారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు మస్తాన్‌, విక్కీ మల్హోత్రా పేర్లు బయటకు వచ్చాయి. మస్తాన్‌ను విచారించగా సినీ నిర్మాత శంకర్ గౌడ్ పేరు వెలుగులోకి వచ్చింది. ఆయన తన కార్యాలయంలో డ్రగ్స్‌తో పార్టీలు ఇస్తున్నట్లు విచారణలో తెలిసిందని పోలీసులు తెలిపారు. ఈ పార్టీలకు ప్రముఖులు హాజరయ్యే వారు అని పోలీసులు వెల్లడించారు. 2017 జులైలో జరిగిన మాదక ద్రవ్యాల కేసులో ఆయన హైదరాబాద్‌ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ముందు హాజరైన విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో పలువురు టాలీవుడ్ నటులను కూడా సిట్ విచారించింది.

Next Story