ఆరేళ్ల బాలిక కిడ్నాప్‌.. 24 గంటల్లో ఛేదించిన పోలీసులు

by  |
ఆరేళ్ల బాలిక కిడ్నాప్‌.. 24 గంటల్లో ఛేదించిన పోలీసులు
X

దిశ, చార్మినార్: కిడ్నాప్‎కు గురైన ఆరేండ్ల బాలికను కాంచన్‌బాగ్ పోలీసులు 24 గంటల్లోనే సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. శంషాబాద్‌లోని ఓ దంపతులకు రూ. 15 వేలకు విక్రయించడానికే మహిళ కిడ్నాప్‌కు పాల్పడినట్లు సౌత్ జోన్ డీసీపీ గజరావు భూపాల్ తెలిపారు. మంగళవారం పురానా హవేలిలోని డీసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో వివరాలు వెల్లడించారు.

డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం..

అంబర్‌పేట్​అలీకేఫ్ ప్రాంతానికి చెందిన ముస్కాన్​ఆలీ మీర్జా(41) తన కూతురు అల్ఫియా(6)తో కలిసి భిక్షాటన చేస్తూ కాలం వెల్లదీస్తోంది. ఈ నెల 13వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో చంచల్‌గూడలో బిక్షాటన చేస్తుండగా ఓ మహిళ వాళ్ల దగ్గరికి వచ్చి తన పేరు ఫాతిమా అని.. హఫీజ్​బాబానగర్‌లో ఓ స్వచ్ఛంద సేవా సంస్థ పెద్ద ఎత్తున బట్టలు, డబ్బు దానం (జకాత్​) ఇస్తుంటారని నమ్మబలికింది. వెంటనే వారిని ఆటోలో ఎక్కించుకుని హఫీజ్​బాబానగర్‌కు చేరుకుంది. అక్కడే ఉన్న ఓ ఇంటిని మీర్జాకు చూపెట్టింది. ఆ ఇంటి యజమాని వద్దకు వెళ్లి జకాత్​తీసుకో అని మాయమాటలు చెప్పింది.

ఆటో దిగి కాస్త ముందుకు మీర్జా వెళ్లగానే ఆరేండ్ల మైనర్​బాలికతో ఆటోలో ఫాతిమా పరారయ్యింది. వెంటనే స్టేషన్‌‌కు పరిగెత్తిన తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కాంచన్‌బాగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని.. సంతోష్​నగర్​డివిజన్​ఏసీపీ శివరాం శర్మ పర్యవేక్షణలో బృందాలను రంగంలోకి దింపారు. హఫీజ్​బాబానగర్ నుంచి రెండు ఆటోలను మార్చుతూ ఫాతిమా బాలికతో శంషాబాద్‎కు చేరుకుంది. అక్కడి నుంచి షాద్‌నగర్‌లోని సొంత ఇంటికి బాలికను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లినట్లు సాంకేతిక ఆధారాలతో పోలీసులు గుర్తించారు. పోలీసులు వెంటనే ఫాతిమాగా చెప్పుకున్న ఆసియాబీ(26) ను అదుపులోకి తీసుకుని కిడ్నాపర్​చెర నుంచి బాలికకు విముక్తి కలిగించారు. ఇది ఇలా ఉంటే శంషాబాద్​పోలీస్​స్టేషన్​పరిధిలో ఆసియాబీ పై అక్రమంగా రేషన్​ బియ్యం తరలింపు కేసు కూడా ఉన్నట్లు డీసీపీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో సౌత్ జోన్ అదనపు డీసీపీ సయ్యద్​రఫీక్, సంతోష్​నగర్​ఏసీపీ శివరాం శర్మ, కాంచన్​బాగ్​ఇన్‌స్పెక్టర్​జి. వెంకట్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Next Story